జర్నలిస్టులకు ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ప్రెస్ అకాడమీ తనకు తానుగా తొలి సారిగా జర్నలిజంలో సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించింది. నెల్లూరులోని విక్రమసింహాపురి విశ్వవిద్యాలయం సహకారంతో కోర్సును నిర్వహిస్తున్నారు. కోర్సు రూపకల్పన తరగతుల నిర్వహణను ప్రెస్ అకాడమీ చేపడితే పరీక్షలు విక్రమసింహపరి విశ్వవిద్యాలయం నిర్వహించి సర్దిఫికెట్లు ప్రధానం చేస్తోంది.
అభ్యర్థులకు సూచనలు – కోర్సు నిబంధనలు
రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి గల జర్నలిస్టులు ఎవరైనా ఈ కోర్సులో అడ్మిషన్ తీసుకోవచ్చు. 3 నెలల సర్టిఫికెట్ కోర్సులో అడ్మిషన్ తీసుకునే విద్యార్థులకు కోర్సు మెటీరియల్ అందించడంతో పాటు ఆన్ లైన్ లో తరగతులు
నిర్వహించాలని నిశ్చయించాం. జర్నలిజంలో వున్న వారు, ఆ రంగంలోకి ప్రవేశించాలనుకునే వారు ప్రాథమిక అంశాలపై అవగాహాన పెంచుకునేందుకు ఈ కోర్సు దోహదపడుతుంది.జర్నలిజంలో వస్తున్న మార్పులు సాంకేతికత అందుబాటులోకి రావటంతో జర్నలిజంలో చోటు చేసుకుంటున్న అనేక అంశాలపై నిపుణులైన అధ్యాపకులు రాసే పాఠ్యాంశాలతో పాటు నిష్టాతులైన జర్నలిస్టులు నిర్వహించే తరగతుల వల్ల గరిష్టంగా లబ్ధిపొందే అవకాశం ఉంటుంది. ప్రెస్ అకాడమీ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలతో అవగాహాన ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఆయా యూనివర్సిటీల సహకారంతో ఈ కోర్సులు నిర్వహిస్తాం.
కోర్సు వివరాలు
మూడు నెలల కాల పరిమితితో నిర్వహించే జర్నలిజం సర్టిఫికెట్ కోర్సులో అడ్మిషన్ తీసుకున్న వారికి ఆన్ లైన్ లో తరగతులు ముగిశాక నెల్లూరులోని విక్రమసింహాపురి విశ్వవిద్యాలయం పరీక్షలు నిర్వహిస్తోంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా పరీక్ష కేంద్రాలను యూనివర్సిటీ నిర్ణయిస్తుంది. విద్యార్థులు అసైన్మెంట్ లు రాయాల్సి వుంటుంది. ఒక్కో పేపర్ కు రెండేసి చొప్పున అసైన్మెంట్లు రాయాలి. అసైన్మెంట్లకు 30 మార్కులు(ఒక్కో అసైన్మెంటుకు 15 మార్కుల చొప్పున) ఉంటాయి. నాలుగు పేపర్లకు సంబంధించి మొత్తం ఎనిమిది అసైన్మెంట్లు విద్యార్థులు రాయాల్సి ఉంటుంది. అసైన్మెంట్లు సొంత దస్తూరితో రాసి ప్రెస్ అకాడమీకి పంపాల్సి వుంటుంది. తుది పరీక్షలు ఒక్కో పేపరు 70 మార్కులకు రాయాలి. విద్యార్థులు అడ్మిషన్ ధరఖాస్తులో రాసే ఫోన్ నంబర్ కు మెయిల్ ఐడీకి ఎప్పడికప్పుడు సమాచారం అందిస్తుంటాం.
నోటిఫికేషన్ విడుదల: 22-07-2021
దరఖాస్తు చివరి గడువు: 20-08-2021
తరగుతులు ప్రారంభం: సెప్టెంబర్ రెండో వారం
అసైన్మెంట్ల సమర్పణ : నవంబర్ రెండో వారం
తుది పరీక్షలు : డిశంబర్ మొదటి వారం
సర్టిఫికెట్ కోర్సు ఇన్ జర్నలిజం
జర్నలిస్టులకు కోర్సు ఫీజు :రూ. 1500/-
విద్యార్హత : ఇంటర్మీడియట్
జర్నలిస్టులు కాకుండా ఈ వృత్తిపై ఆసక్తి గల వారెవరైనా ఈ కోర్సులో చేరే అవకాశం వుంది.
వీరికి కనీస విద్యార్హత డిగ్రీతో పాటు కోర్సు ఫీజు రూ. 3000/- గా నిర్ణయించాం.
మరిన్ని వివరాలకు సంప్రందించండి
మెయిల్ ఐడీ :
pressacademycontact@gmail.com