సి.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో విశాఖపట్టణం జిల్లా జర్నలిస్టులకు శిక్షణ తరగతులు
26-09-2020 తేదిన ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ జర్నలిస్టులకు నిర్వహించిన ఆన్ లైన్ శిక్షణా తరగతుల్లో భాగంగా ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ ప్రారంభ ఉపన్యాసం చేసారు.
ముఖ్య అతిధులుగా సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (పేర్ని నాని), విశాఖపట్టణం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఐఏఎస్ లతో పాటు విశిష్ట అతిధిగా ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్ లు పాల్గొన్నారు.
సమన్వయకర్తగా విక్రమసింహపురి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఎల్.విజయకృష్ణారెడ్డితో పాటు ఏపీ ప్రెస్ అకాడమీ కార్యదర్శి బాలగంగాధర తిలక్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శిక్షణలో పాల్గొన్న జర్నలిస్టులకు ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ తో పాటు జర్నలిస్టుల నైపుణ్యాన్ని పెంపొందించేలా అకాడమీ ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాలను అందించారు.
శిక్షణ తరగతుల అంశాలు:
1.వార్తలను సేకరించడంలో మెళకువలు – వార్తల్ని పసిగట్టడం ఎలా? : జి వల్లీశ్వర్, సీనియర్ పాత్రికేయులు
2.వార్తా రచన – తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు : ఉమా మహేశ్వరరావు, సీనియర్ పాత్రికేయులు